పాన్ గల్ మండల పరిధిలో ఉన్న రేమద్దుల గ్రామం లో ఈ రోజు ఏదుట్ల - రేమద్దుల - సింగాయపల్లి గ్రామాలను కలుపుతూ BT రోడ్డు నిర్మించాలని మొదట డా ౹౹ BR అంబేద్కర్ విగ్రహానికి మరియు మహాత్మ గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేసి నిరసన దీక్ష చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాన్ని వివిధ ఊళ్ళతో కలుపుతూ 4 దిక్కులకు రోడ్లు ఉన్నప్పటికీ ఏ ఒక్క రోడ్డు కూడ వాడుకకు పనికి రాకుండా ఉన్నాయి , మా గ్రామం నుండి ఓట్లు వేయించుకుని గత 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ MLA లే ప్రజాప్రతినిధులుగా ఉండి మా గ్రామాన్ని కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే పరిగణించారు కానీ అభివృద్ధికి మూలమైన రోడ్డు సౌకర్యాలు కల్పించలేదు. రోడ్డు సౌకర్యం లేక సరిపడా బస్సులను RTC నడపటం లేదు దాని కారణంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఏదుట్ల వరకు 3 KMS కాలి నడకన వెళ్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి BT రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా వనపర్తి జిల్లా అధ్యక్షులు గంధం ప్రవీణ్ కుమార్ గారు మండల బీజేపీ నాయకులు నర...